తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి గారాల పట్టి.. లంగావోణి పిక్స్ వైరల్!

by Disha Web Desk 9 |
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి గారాల పట్టి.. లంగావోణి పిక్స్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఎప్పుడూ గ్లామర్ ఫొటోలతో దర్శనమిస్తుంటుంది. కానీ.. తాజాగా ఈ అమ్మడు యువత ఫిదా అయ్యే అందచందాలతో సంప్రదాయ బద్ధంగా లంగావోణీలో మెరిసింది. కాగా ఈ రోజు(ఆగస్టు 28) ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లింది. నెలల వ్యవధిలోనే జాన్వీ శ్రీవారి దగ్గరకు వెళ్లడం ఇది రెండవసారి. కొన్ని నెలల క్రితం తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి బ్లూ లెహంగా ధరించి.. ఆలయం ఎదుట కనిపించింది. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ లంగావోణీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాన్వీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనీయర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Read More : ఆ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పేశా.. ఫస్ట్ లవ్‌పై జాన్వీ ఓపెన్



Next Story

Most Viewed